ఈ వ్యక్తి మద్యం మత్తులో అర్ధరాత్రి ఏకంగా వారికే కాల్ చేశాడు.. చివరకు అతడి మాటలు విని అంతా అవాక్కయ్యారు..
ABN , First Publish Date - 2022-02-17T00:56:13+05:30 IST
మద్యం మత్తులో కొందరు తాగుబోతులు ఏం చేస్తుంటారో వారికే తెలీదు. మత్తులో వారు చేసిన పనులను పొద్దున తలచుకుని.. ‘‘ఏంటి నేను అలాంటి పనులు చేశానా, అలా అన్నానా’’.. అంటూ ఏమీ తెలీనట్లు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..
మద్యం మత్తులో కొందరు తాగుబోతులు ఏం చేస్తుంటారో వారికే తెలీదు. మత్తులో వారు చేసిన పనులను పొద్దున తలచుకుని.. ‘‘ఏంటి నేను అలాంటి పనులు చేశానా, అలా అన్నానా’’.. అంటూ ఏమీ తెలీనట్లు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. హర్యానాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో చేసిన పని.. అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఫుల్గా మందు కొట్టి అతడు చేసిన పోన్ కాల్.. చివరకు చాలా దూరం వెళ్లింది.
అన్ని రాష్ట్రాల్లో మాదిరే హర్యానాలో కూడా అధికారులు 112 అత్యవసర హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఈ నంబర్కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఓ తాగుబోతు చేసిన పనే ఇప్పుడు హాట్టాపిక్ అయింది. రాయ్పురానిలోని తప్రియా గ్రామానికి చెందిన నరేష్ కుమార్ అనే వ్యక్తి.. ఫుల్గా మందుకొట్టి 112కి కాల్ చేసి, సాయం చేయమని కోరతాడు. దీంతో పోలీసులు వెంటనే అతడు చెప్పిన ప్రాంతానికి వెళ్లారు.
ఈ దంపతులు సామాన్యులు కారు.. రాత్రయిందంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీరు చేసే పనులు ఏంటో తెలుసా..
అక్కడికి వచ్చిన పోలీసులు.. ఎందుకు కాల్ చేశారని అడిగారు. ‘‘అర్ధరాత్రి వేళల్లో పోలీసులు కరెక్ట్గా పని చేస్తున్నారా.. లేదా నిర్లక్ష్యంగా ఉన్నారా.. అనే సందేహం వచ్చింది. అందుకే ఓసారి టెస్ట్ చేద్దామని పోన్ చేశా’’.. అని అనగానే.. అవాక్కవడం పోలీసుల వంతయింది. ఈ తంతును మొత్తం కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.