అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-10-29T04:40:20+05:30 IST

అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏసీబీ డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన్‌ అన్నారు. నాయుడుపేటలోని నాయుడు ఫంక్షన్‌హాల్‌లో గురువారం అవినీతి నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ప్రతిజ్ఞ చేయిస్తున్న ఏసీబీ డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన్‌

నాయుడుపేట టౌన్‌, అక్టోబరు 28 : అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏసీబీ డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన్‌ అన్నారు. నాయుడుపేటలోని నాయుడు ఫంక్షన్‌హాల్‌లో గురువారం అవినీతి నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వారితో ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు అన్ని సమయాలలోనూ నిజాయితీ, సమగ్రత ప్రమాణాలకు కట్టుబడి ఉండాలన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్టు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు బాధ్యతగా ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐలు వేణు, రమేష్‌బాబు, శ్రీనివాసులు, కిరణ్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ శోభమ్మ, తహసీల్దారు శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, సీవీరామన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గాదిరెడ్డి గోపి, వాణిజ్యవిభాగ వర్తకసంఘ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T04:40:20+05:30 IST