టీఆర్‌ఎస్‌ మోసపూరిత వాగ్ధానాలను నమ్మకండి

ABN , First Publish Date - 2022-05-24T05:00:42+05:30 IST

మోసపూరితమైన వాగ్ధానాలు చేస్తూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చూస్తున్న టీఆర్‌ఎస్‌ వాగ్ధానాలను ప్రజలు నమ్మొద్దని టీపీసీసీ నాయకుడు వై. నరోత్తం అన్నారు.

టీఆర్‌ఎస్‌ మోసపూరిత వాగ్ధానాలను నమ్మకండి
గిరిజనులకు అవగాహన కల్పిస్తున్న టీపీసీసీ నాయకుడు నరోత్తం

రచ్చబండలో టీపీసీసీ నాయకుడు నరోత్తం

జహీరాబాద్‌, మే 23: మోసపూరితమైన వాగ్ధానాలు చేస్తూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చూస్తున్న టీఆర్‌ఎస్‌ వాగ్ధానాలను ప్రజలు నమ్మొద్దని టీపీసీసీ నాయకుడు వై. నరోత్తం అన్నారు. సోమవారం జహీరాబాద్‌ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలంలో గల విట్‌నాయక్‌ తండా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాహుల్‌ గాంధీ వరంగల్‌ సభ వేదికగా రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లోని  అన్ని వాగ్ధానాలను కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నెరవేర్చడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రె్‌సను ఆశీర్వదించాలన్నారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి నరోత్తం ఇంటి ఇంటికీ తిరిగి వరంగల్‌ సభ రైతు డిక్లరేషన్‌ కరపత్రాలను పంచుతూ, వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగిశెట్టి, కో-ఆప్షన్‌ సభ్యులు మైనొద్దీన్‌, మాజీ సర్పంచు ముల్తాని, సర్పంచు నవాజ్‌రెడ్డి, ఎండి యూసుఫ్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజునాయక్‌, శ్రీకాంత్‌, మహమ్మద్‌ షరీఫ్‌, దాస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు విఠల్‌, నరేష్‌, బలరాం, సుభాష్‌, రేఖానాయక్‌, లచ్చిరామ్‌, దేవ్‌లనాయక్‌, ధర్మునాయక్‌, కాంగ్రెస్‌ నాయకులు, తండా నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:00:42+05:30 IST