దళితులకు అన్యాయం చేస్తే సహించం’

ABN , First Publish Date - 2020-07-12T11:25:33+05:30 IST

శ్రీకాకుళం రూరల్‌ మండలం సిద్ధిపేట పం చాయతీ వద్ద భూ పంపిణీ విషయంలో దళితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని కేఎన్‌పీఎస్‌, ఎస్‌ఎస్‌పీఎస్‌

దళితులకు అన్యాయం చేస్తే సహించం’

రామలక్ష్మణ జంక్షన్‌: శ్రీకాకుళం రూరల్‌ మండలం సిద్ధిపేట పం చాయతీ వద్ద భూ పంపిణీ విషయంలో దళితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని కేఎన్‌పీఎస్‌, ఎస్‌ఎస్‌పీఎస్‌ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు శని వారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతిని ధులు మిస్క కృష్ణయ్యం, డి.గణేష్‌ మాట్లాడుతూ, కొన్నేళ్ల క్రితం అధికారులు సిద్ధిపేటలో భూమి కొనుగోలు చేసి దళితులకు కేటాయించారని తెలిపారు.  ప్రస్తుతం ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఈ భూములను సేకరించి బీసీలకు కేటాయించడం దారుణమన్నారు. దీనిపై తీవ్ర ప్రతిఘటన తప్పదన్నారు. నిరసనలో చెల్లయ్య, అక్కమ్మ, చిత్రి లక్ష్మణరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-12T11:25:33+05:30 IST