పక్క సీటులో కూర్చున్న స్త్రీలతో మాట్లాడకండి.. ఆర్టీసీ డ్రైవర్లకు వింత నిబంధన

ABN , First Publish Date - 2020-02-19T18:30:08+05:30 IST

తమిళనాడులోని కోయంబత్తూరు ఆర్టీసీ రీజియన్ పరిధిలో డ్రైవర్లకు అధికారులు ఓ నిబంధన...

పక్క సీటులో కూర్చున్న స్త్రీలతో మాట్లాడకండి.. ఆర్టీసీ డ్రైవర్లకు వింత నిబంధన

కోయంబత్తూర్: తమిళనాడులోని కోయంబత్తూరు ఆర్టీసీ రీజియన్ పరిధిలో డ్రైవర్లకు అధికారులు ఓ నిబంధన జారీ చేశారు. ఆ నిబంధన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. డ్రైవర్‌కు సమీపంలో ఉండే సీటులో మహిళలు కూర్చుంటే వారితో డ్రైవర్లు మాట్లాడకూడదనేదే ఆ నిబంధన సారాంశం. మహిళలతో మాట్లాడుతూ బస్సును పరధ్యానంలో నడుపుతున్నారని ఫిర్యాదులు అందడం వల్లే ఈ నిబంధన జారీ చేసినట్లు తెలిసింది. ఈ నిబంధనను జారీ చేస్తున్నట్లు బుధవారం కోయంబత్తూరు ఆర్టీసీ పరిధిలోని అధికారులు ప్రకటించారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2020-02-19T18:30:08+05:30 IST