డంపింగ్ యార్డు ఏర్పాటు చెయ్యొద్దు
ABN , First Publish Date - 2021-03-05T06:19:41+05:30 IST
డంపింగ్ యార్డును ఏర్పాటు చెయ్యొద్దని పాత నేరేడుచర్ల, కమలానగర్, బట్టువానికుంట గ్రామస్థులు డిమాండ్ చేశారు.
నేరేడుచర్ల, మార్చి 4: డంపింగ్ యార్డును ఏర్పాటు చెయ్యొద్దని పాత నేరేడుచర్ల, కమలానగర్, బట్టువానికుంట గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నేరేడుచర్ల ప్రధాన కూడలిలో గురువారం రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. కలెక్టర్ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని కమిషనర్ను ఆదేశించడంతో గ్రామస్థులు ధర్నాకు దిగారు. కలెక్టర్ నిర్ణయంపై అధికారులు వివరణ ఇవ్వాలని, రెవెన్యూ అధికారులు వచ్చే వరకు ధర్నా విరమించేది లేదంటూ భీష్మించారు. ధర్నా చేస్తున్న గ్రామస్థులకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీజేఎస్ నాయకులు మద్దతు పలికారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.