వివాదం తేలే వరకు పీఆర్సీ ప్రక్రియపై ఒత్తిడి తేవొద్దు
ABN , First Publish Date - 2022-01-23T06:05:46+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన పీఆర్సీపై వివాదం నడుస్తున్నందున అది తేలే వరకు పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాలని తమపై ఒత్తిడి చేయవద్దని ట్రెజరీ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది.
ట్రెజరీ ఉద్యోగులు వినతి
విశాఖపట్నం, జనవరి 22: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన పీఆర్సీపై వివాదం నడుస్తున్నందున అది తేలే వరకు పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాలని తమపై ఒత్తిడి చేయవద్దని ట్రెజరీ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఉపసంచాలకునికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కె.ఆనందకుమార్ మాట్లాడుతూ తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని, నూతన పీఆర్సీ వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తామూ భావిస్తున్నామన్నారు.అందువల్ల ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు తాము కూడా ఉద్యమంలో భాగమయ్యే ఉన్నందున, పీఆర్సీ ప్రక్రియపై తమపై ఒత్తిడి చేయవద్దని కోరారు.