ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దు
ABN , First Publish Date - 2021-02-27T05:38:54+05:30 IST
బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులను ఫీజుల కోసం ప్రైవేట్ పాఠ శాలలు ఒత్తిడి చెయొద్దని మాదిగ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రానా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
గుజరాతీపేట: బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులను ఫీజుల కోసం ప్రైవేట్ పాఠ శాలలు ఒత్తిడి చెయొద్దని మాదిగ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రానా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇదే విషయమై నగ రంలోని గీతాంజలి స్కూల్ వద్ద జిల్లా దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్ర వారం విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి ధర్నా నిర్వహించారు. ఫీజుల చెల్లింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు.