ప్రాణాలతో చెలగాటం వద్దు: వర్ల
ABN , First Publish Date - 2020-03-29T08:44:49+05:30 IST
సామాజిక మాధ్యమాలు వేదికగా కొద్దిమంది చేస్తున్న ప్రచారంపై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ట్విటర్ వేదికగా ఆగ్రహం...
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాలు వేదికగా కొద్దిమంది చేస్తున్న ప్రచారంపై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కరోనా మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరిమికొట్టడంలో అందరూ కులమతాలకు, రాజకీయలకు అతీతంగా కలిసికట్టుగా కదలాలి. కొందరు మత పెద్దలు ఈ రక్కసిని తరిమేస్తామని అమాయకులను మభ్యపెడుతున్నారు. దయచేసి సామాజిక దూరం పాటించండి. మతపరమైన సమావేశాలకు ఇది అదను కాదు. అమాయక ప్రాణాలతో ఆడకండి. తస్మాత్ జాగ్రత్త’’ అని వర్ల ట్వీట్ చేశారు.