పనుల్లో నాణ్యత లోపించొద్దు
ABN , First Publish Date - 2021-10-20T05:01:23+05:30 IST
మండల కేంద్రం నుం చి ఉడిత్యాల్, వీరన్నపల్లి గ్రామాలకు నూతనంగా చేపడుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి మంగళవారం పరిశీలిం చారు.
- డబుల్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సి. లక్ష్మారెడ్డి
బాలానగర్, అక్టోబరు 19 : మండల కేంద్రం నుం చి ఉడిత్యాల్, వీరన్నపల్లి గ్రామాలకు నూతనంగా చేపడుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి మంగళవారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా డబుల్ రోడ్డు పరిస్థితులను నాయకులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పనుల్లో నాణ్యతాప్రమాణాలను పాటించాలని, నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశిం చారు. అనంతరం మండలంలోని మామిడిగుంట తం డాలో నిర్వహించిన అమ్మవారి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్ నాయక్, వెంకటాచారి, అభిమన్యురెడ్డి, చెన్నారెడ్డి, భూపాల్, డీఈ వెంకటేశ్వర్రెడ్డి, నాయకు లు, గిరిజనులు పాల్గొన్నారు.