మా ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దు.. ప్రపంచ దేశాలకు బిడెన్ వార్నింగ్

ABN , First Publish Date - 2020-10-23T16:07:11+05:30 IST

అమెరికా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ తీవ్ర హెచ్చరిక చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ మధ్య మూడోసారి డిబెట్ నడిచింది.

మా ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దు.. ప్రపంచ దేశాలకు బిడెన్ వార్నింగ్

వాషింగ్టన్ : అమెరికా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ తీవ్ర హెచ్చరిక చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ మధ్య మూడోసారి డిబెట్ నడిచింది. ఈ సందర్భంగా జో బిడెన్ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరైనా సరే... ఏ దేశమైనా సరే... అమెరికా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని నేను స్పష్టంగా పేర్కొంటున్నాను’’ అని బిడెన్ నొక్కి వక్కాణించారు.


కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కరోనాను కట్టడి చేయడానికి ట్రంప్ సర్కార్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని, చైనాకు రాకపోకలు నిషేధించడంపై ట్రంప్ ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. కరోనా మరణాలకు కారణమైన వారు అధ్యక్షుడిగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదని బిడెన్ ధ్వజమెత్తారు. తనను అధ్యక్షుడిగా ఎందుకు ఎన్నుకోవాలో దేశ ప్రజలకు బాగా తెలుసని బిడెన్ పేర్కొన్నారు. 


2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అనూహ్య విజయం వెనుక రష్యా ప్రమేయం ఉందని గతంలో ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆదేశాలు జారీ చేశారని రష్యా గూఢచారి సంస్థ పేర్కొంది. తాజాగా... అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు కూడా దీనినే పేర్కొంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటూనే ఉందని పేర్కొంది. అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి బిడెన్ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా రష్యా విభిన్న రకాల పద్ధతులను వినియోగిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బిడెన్ పై వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-10-23T16:07:11+05:30 IST