ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచొద్దు
ABN , First Publish Date - 2020-02-20T09:49:05+05:30 IST
చదువులో మొదటి ర్యాంకు కోసం పిల్లలపై ఒత్తిడి తేవద్దని వారిలో ఉన్న సృజన వెలికి తీయాలని రాష్ట్ర
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ హైమావతి
నెల్లూరు (వీఆర్సీ) ఫిబ్రవరి 19 : చదువులో మొదటి ర్యాంకు కోసం పిల్లలపై ఒత్తిడి తేవద్దని వారిలో ఉన్న సృజన వెలికి తీయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ జీ హైమావతి పేర్కొన్నారు. నగరంలోని రహదారులు, భవనాల అతిథి గృహంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 6-14 మధ్య వయస్సున్న విద్యార్థులకు నిర్బంధ ఉచిత విద్య అందించాలన్నారు. 14-18 మధ్య వయస్సున్న వారికి నైపుణ్య శిక్షణ అందించడానికి ప్రభుత్వం చర్చలు తీసుకుంటోందన్నారు. పిల్లల మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకొని వారిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూసుకోవాలన్నారు. ఇలాంటి వారి కోసమే ఆనంద వేదిక మొదటి పీరియడ్లో నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం ఆమె నగరంలోని మద్రాసు బస్టాండు వద్దగల బాలికల వసతిగృహాలను పరిశీలించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యురాలు పద్మలత, సెట్నెల్ సీఈవో సుస్మితారెడ్డి పాల్గొన్నారు.