బీడీ పరిశ్రమపై ఆంక్షలు విధించొద్దు

ABN , First Publish Date - 2021-03-07T05:09:07+05:30 IST

బీడీ పరిశ్రమపై ఆంక్షలు విధించొద్దని తెలంగాణ బ హుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.సిద్ధిరాములు డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో తెల ంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తిలక్‌గార్డెన్‌ నుంచి కలెక్టరేట్‌ ధర్నాచౌక్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

బీడీ పరిశ్రమపై ఆంక్షలు విధించొద్దు
నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న బీడీ కార్మికులు

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 6: బీడీ పరిశ్రమపై ఆంక్షలు విధించొద్దని తెలంగాణ బ హుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.సిద్ధిరాములు డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో తెల ంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తిలక్‌గార్డెన్‌ నుంచి కలెక్టరేట్‌ ధర్నాచౌక్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధిరాములు మాట్లాడుతూ.. కేం ద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభు త్వం బీడీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం సీవోటీపీఏ 2003 చట్టం సవరణ చేసి బీడీ కార్మికుల ఉపా ధిని దెబ్బతీస్తోందన్నారు. దీంతో దేశంలో 85లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల మంది ఉపాధి కోల్పోయే అ వకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బీడీ కట్టలపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేసి బీడీలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని లేదా బీడీ కా ర్మికులకు 12వేల భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశా రు. బీడీ కట్టపై గల గొంతు క్యాన్సర్‌ బొమ్మ తొలగించాల ని, కోట్పా చట్టం నుంచి బీడీ పరిశ్రమను మినహాయింపు ఇవ్వాలని డిమాం డ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2021-03-07T05:09:07+05:30 IST