అభివృద్ధికి ఇబ్బందులు కల్గించొద్దు

ABN , First Publish Date - 2022-05-20T04:47:21+05:30 IST

పర్యాటకులను ఆక ర్షించేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మినీ ట్యాం క్‌బండ్‌, శిల్పారామం నిర్మాణ పనుల కోసం వెం టనే విద్యుత్‌ సరఫరా చేయాలని మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్‌ విద్యుత్‌ అధికారులకు సూచించారు.

అభివృద్ధికి ఇబ్బందులు కల్గించొద్దు
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- ట్యాంక్‌బండ్‌, శిల్పారామం పనులకు విద్యుత్‌ సరఫరా చేయాలి

- మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

- విద్యుత్‌ అధికారులతో సమావేశం 


మహబూబ్‌నగర్‌, మే 19: పర్యాటకులను ఆక ర్షించేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మినీ ట్యాం క్‌బండ్‌, శిల్పారామం నిర్మాణ పనుల కోసం వెం టనే విద్యుత్‌ సరఫరా చేయాలని మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్‌ విద్యుత్‌ అధికారులకు సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో కౌన్సిలర్లతో కలిసి ఆయన విద్యుత్‌ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా కేంద్రంలోని పెద్దచె రువు మధ్యలో ఐల్యాండ్‌ పనులు, సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నందున వెంటనే వి ద్యుత్‌ కేబుళ్లు ఏర్పాటుచేసి లైట్లను ఏర్పాటుచే యాలన్నారు. పనులకు ఇబ్బందులు కలుగకుండా విద్యుత్‌ సరఫరా కోసం నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా, హ న్వాడ మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ అవసరాలకోసం వెంటనే 19 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పా టు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌ బండ్‌పై వెంటనే 50కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తామని, మిగతా ట్రాన్స్‌ఫార్మర్లను రెండు, మూడ్రోజుల్లో ఏర్పాటుచేస్తామని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఈ మూర్తి, ఈఈ, డీఈలు పాల్గొనగా, కౌన్సిలర్‌ జాజిమొగ్గ నర్సింహు లు, నాయకులు కృష్ణయ్య, రమణారెడ్డి, చెన్నయ్య, హరిచందర్‌నాయక్‌, చుక్కయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T04:47:21+05:30 IST