లాక్‌డౌన్‌లో మసీదుకు వద్దు: ఇస్లామిక్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2020-04-06T07:19:37+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో ముస్లింలు మసీదులకు వెళ్లకుండా చూడాలని మత పెద్దలకు ఇండియా ఇస్లామిక్‌ కల్చరల్‌ సెంటర్‌ ఆదేశించింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను...

లాక్‌డౌన్‌లో మసీదుకు వద్దు: ఇస్లామిక్‌ సెంటర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: లాక్‌డౌన్‌ సమయంలో ముస్లింలు మసీదులకు వెళ్లకుండా చూడాలని మత పెద్దలకు ఇండియా ఇస్లామిక్‌ కల్చరల్‌ సెంటర్‌ ఆదేశించింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్రమశిక్షణతో అమలు చేయాలని సంస్థ ఉపాధ్యక్షుడు ఎస్‌.ఎం.ఖాన్‌ సూచించారు. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2020-04-06T07:19:37+05:30 IST