అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2022-07-03T03:42:56+05:30 IST

అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ఎస్పీ కె సురేష్‌కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని గుండాల గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గ్రామస్థు లకు నిత్యావసర సరుకులు, వృద్ధులకు వాకర్స్‌, విద్యార్థులకు నోటుబుక్స్‌, ప్యాడ్‌, యువతకు వాలీబాల్‌ కిట్లను పంపిణీ చేశారు.

అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు
యువతకు వాలీబాల్‌ కిట్లను పంపిణీ చేస్తున్న ఎస్పీ సురేష్‌కుమార్‌

- ఎస్పీ సురేష్‌కుమార్‌

తిర్యాణి, జూలై 2: అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ఎస్పీ కె సురేష్‌కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని గుండాల గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గ్రామస్థు లకు నిత్యావసర సరుకులు, వృద్ధులకు వాకర్స్‌, విద్యార్థులకు నోటుబుక్స్‌, ప్యాడ్‌, యువతకు వాలీబాల్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్‌వల్ల ప్రజల్లో పోలీసు లతో స్నేహపూరిత వాతావరణం నెలకొంద న్నారు. అసాంఘిక శక్తులకు, కొత్త వ్యక్తు లకు ఆశ్రయం కల్పించకూడదని పేర్కొ న్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి సామూహిక భోజనాలు చేశారు. ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ నరేందర్‌, ఎస్సై రమేష్‌, ఆర్‌ఎస్సైలు ఓదెలు, సర్పంచు జంగుబాయి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T03:42:56+05:30 IST