విద్యుత అధికారులకు డబ్బులు ఇవ్వవద్దు

ABN , First Publish Date - 2022-08-07T06:24:28+05:30 IST

విద్యుతశాఖ అధికారుల కు ఒక్క రైతు కూడా డ బ్బులు ఇవ్వవద్దని ఎమ్మె ల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.

విద్యుత అధికారులకు డబ్బులు ఇవ్వవద్దు
సమావేశంలో మాట్లాడుతున్న భూపాల్‌రెడ్డి

తిప్పర్తి మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి  

 తిప్పర్తి, ఆగస్టు 6: విద్యుతశాఖ అధికారుల కు ఒక్క రైతు కూడా డ బ్బులు ఇవ్వవద్దని ఎమ్మె ల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలో ఎంపీపీ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయ న ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలో జరిగిన అభివృద్ధి పనులు, జరగాల్సిన పనులపై సంబంధిత అధికారులతో చర్చించి పనులు పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం విద్యుతశాఖలో సంబంధిత మండల అధికారి అవినీతికి పాల్పడుతూ రైతుల వద్ద ఇష్టారాజ్యంగా డబ్బు లు వసూలు చేస్తున్నారని రైతుల ఫిర్యాదుతో అధికారిని సమావేశంలో నిలదీశా రు. అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఏఈపై చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యే ఎస్‌ఈకి ఫోనలో ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రత్యామ్నాయ పంటలైన ఫామాయిల్‌, బత్తాయి, డ్రాగనప్రూట్‌, తేనెటీగల పెంపకం గురించి వివరించారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణయ్య, ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, డీఈ నాగయ్య, డీసీసీబీ డైరెక్టర్‌ పాశం సంపతరెడ్డి, వైస్‌ ఎంపీపీ  వెంకట్‌రెడ్డి, ఏవో సన్నిరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-07T06:24:28+05:30 IST