టెన్త్ మార్కుల మెమోలో గ్రేడ్లు, మార్కులు ఇవ్వొద్దు
ABN , First Publish Date - 2020-07-09T09:22:04+05:30 IST
పదో తరగతి మార్కుల మెమోలో గ్రేడ్లు, మార్కులు ఇవ్వొద్దని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ ప్రతినిధులు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్
పాఠశాల విద్య కమిషనర్కు విద్యార్థి సంఘాల వినతి
విజయవాడ, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి మార్కుల మెమోలో గ్రేడ్లు, మార్కులు ఇవ్వొద్దని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ ప్రతినిధులు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
2019-20 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దుచేసిన దృష్ట్యా చాలావరకు ప్రైవేట్ కార్పొరేషన్ విద్యాసంస్థలు తమ సీఎస్ఈ వెబ్సైట్లో ఇష్టానుసారంగా 10/10 జీపీఏ లక్ష్యంగా మార్కులు ఎంట్రీ చేశాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే కచ్చితత్వాన్ని పాటించి విద్యార్థుల మార్కులను నమోదు చేయగా, ప్రైవేట్, కార్పొరేట్ విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చే ఆస్కారం ఉందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు.