నకిరేకల్‌లో ప్రభుత్వ కార్యాలయాలను కూల్చివేయవద్దు

ABN , First Publish Date - 2022-01-25T06:19:26+05:30 IST

నకిరేకల్‌ మండల పరిషత ఆవరణ లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూల్చివేసి వెజ్‌, నానవెజ్‌ స మీకృత మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని భువనగిరి ఎంపీ వెంకట్‌రెడ్డి డి మాండ్‌ చేశారు.

నకిరేకల్‌లో ప్రభుత్వ కార్యాలయాలను కూల్చివేయవద్దు
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న నకిరేకల్‌ అఖిలపక్ష నాయకులు

నకిరేకల్‌, జనవరి 24: నకిరేకల్‌ మండల పరిషత ఆవరణ లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూల్చివేసి వెజ్‌, నానవెజ్‌ స మీకృత మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని భువనగిరి ఎంపీ వెంకట్‌రెడ్డి డి మాండ్‌ చేశారు. సోమవారం ఎంపీ ఆధ్వర్యంలో నకిరేకల్‌ అఖిలప క్ష కమిటీ నాయకులు కలెక్టర్‌ ప్రశాంత జీవనపాటిల్‌కు వినతిప త్రం అందజేశారు. నూతన భవనాలను కూల్చివేయడం సరైందికాదని పేర్కొన్నారు. 552 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ భూమిలో సమీకృ త మార్కెట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు దైద రవీందర్‌, చెరుకు లక్ష్మి, రాయి కృష్ణ, గాజు ల శ్రీనివాస్‌, బొమ్మకంటి కొమురయ్య, రాఘవరెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకన్న, కొం డయ్య, వీరార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నల్లగొండరూరల్‌: సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని ఎంపీ వెంకట్‌రెడ్డి కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మాట్లాడుతూ గ్రామాల్లో కరెంటు బిల్లులు అధికంగా రా వడంతో గ్రామాభివృద్ధి నిధులు ఆ బిల్లులకే సరిపోతున్నాయని, గ్రామంలో సమస్యల పరిష్కారానికి నిధులు లేక ఇబ్బందులు ప డుతున్నారని తెలిపారు. ఈ మేరకు సమస్యను పరిష్కరించేందు కు కృషి చేస్తానని కలెక్టర్‌ అన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ లక్ష్మ య్య, ఎంపీపీ సుమన, వైస్‌ఎంపీపీ సుమన, సర్పంచ వెంకన్నయాదవ్‌, నాయకులు మోహనరెడ్డి, నాయకులు ఉన్నారు. 

Updated Date - 2022-01-25T06:19:26+05:30 IST