యాసంగిలో వరి సాగు వద్దు

ABN , First Publish Date - 2021-12-05T04:06:48+05:30 IST

యాసంగిలో వరి పంటను రైతులు సాగు చేయొద్దని తహసీల్దార్‌ అనంతరాజు అన్నారు. మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఏడీఏ రాజుల నాయుడితో కలిసి ప్రారంభించారు.

యాసంగిలో వరి సాగు వద్దు
పెంచికలపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న తహసీల్దార్‌ అనంతరాజు

పెంచికలపేట, డిసెంబరు 4: యాసంగిలో వరి పంటను రైతులు సాగు చేయొద్దని తహసీల్దార్‌ అనంతరాజు అన్నారు. మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఏడీఏ రాజుల నాయుడితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన వరి ధాన్యాన్ని తీసుకుని రావాలని సూచించారు. యాసంగిలో ఆరుతడి పంటలే సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం కొనయ్య, ఎంపీటీసీ రాజన్న, సీసీ సుశీల, ఏఈవో శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-05T04:06:48+05:30 IST