అన్యాయం చేస్తే ఆత్మహత్య చేసుకుంటా

ABN , First Publish Date - 2021-08-06T05:15:58+05:30 IST

స్థలం విషయంలో తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని టెక్కలి మేజరు పంచా యతీ ఆదిఆంధ్రావీధికి రౌతు లక్ష్మి బెదిరించింది. చేతితో కిరోసిన్‌ క్యాన్‌ పట్టుకొని హడావుడి చేసింది.

అన్యాయం చేస్తే ఆత్మహత్య చేసుకుంటా
పోలీసులతో వాదిస్తున్న లక్ష్మి

 కిరోసిన్‌ క్యాన్‌తో మహిళ హడావుడి

టెక్కలిరూరల్‌:స్థలం విషయంలో తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని టెక్కలి మేజరు పంచా యతీ  ఆదిఆంధ్రావీధికి  రౌతు లక్ష్మి బెదిరించింది. చేతితో కిరోసిన్‌ క్యాన్‌ పట్టుకొని హడావుడి చేసింది. పోలీ సులు సర్ధిచెప్పడంతో ఆమె శాంతించిం ది. వివరాల్లోకి వెళ్తే.. రౌతు లక్ష్మి 2007లో బసవల నూకరాజు, దాలమ్మల వద్ద ఓ స్థలాన్ని కొనుగోలు చేసింది. అయితే, ఈ స్థలం తమదని నూకరాజు బంధువు బసవల గోవింద్‌ ఇటీవల రెవెన్యూ అధికారు లకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఈ స్థలాన్ని పరిశీలించేందుకు రెవెన్యూ అధి కారులు రావడంతో వివాదం చెలరేగింది. ఈ స్థలం తనదని.. రిజిస్ట్రేషన్‌, ఈసీ పత్రాలు ఉన్నాయని లక్ష్మి అధికారులకు తెలియజేసింది. తనకు అన్యాయం చేస్తే కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది.  విషయం తెలుసుకున్న టెక్కలి ఎస్‌ఐ కామేశ్వరరావు తన సిబ్బందితో ఆదిఆంధ్రావీధి వెళ్లారు. లక్ష్మి తన ద గ్గర ఉన్న పత్రాలను రెవెన్యూ, పోలీసులకు చూపడంతో వివాదం సద్దుమణిగింది.  


 


 


 

Updated Date - 2021-08-06T05:15:58+05:30 IST