తెలంగాణలోకి రావద్దు!

ABN , First Publish Date - 2020-03-27T09:02:27+05:30 IST

కర్నూలు జిల్లా నంద్యాలలో గురురాఘవేంద్ర బ్యాంకింగ్‌ కోచింగ్‌ సెంటర్లో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 20వేల మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో తెలంగాణలోని వివిధ జిల్లాలకు...

తెలంగాణలోకి రావద్దు!

  • అలంపూర్‌ టోల్‌ప్లాజా వద్ద విద్యార్థుల అడ్డగింత 


కర్నూలు జిల్లా నంద్యాలలో గురురాఘవేంద్ర బ్యాంకింగ్‌ కోచింగ్‌ సెంటర్లో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 20వేల మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 600మందికి స్వస్థలాలకు వెళ్లేందుకు పోలీసులు ఎన్‌ఓసీ ఇచ్చారు. కానీ సరిహద్దుల్లో తెలంగాణ అధికారులు అనుమతించకపోవడంతో అక్కడే రాత్రంతా పడిగాపులు పడ్డారు. ఇదే సమయంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన వలస కూలీలను మాత్రం సరిహద్దు దాటించారు. వారికి వైద్యపరీక్షలు నిర్వహించకుండానే అనుమతించడంతో అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్థులు చెక్‌పోస్టు వద్ద బైఠాయించారు. అయినా ఫలితం లేకపోవడంతో గురువారం మధ్యాహ్నం 1గంట సమయానికి వెనక్కి తిరిగి నంద్యాలకు చేరుకున్నారు. హాస్టళ్లు తిరిగి తెరిపించి విద్యార్థులకు భోజన సౌకర్యం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ కంబగిరి రాముడు తెలిపారు. 

Updated Date - 2020-03-27T09:02:27+05:30 IST