ప్రచ్ఛన్న, ప్రత్యక్ష యుద్ధం చేయం: జిన్పింగ్
ABN , First Publish Date - 2020-09-23T07:36:44+05:30 IST
ఏ దేశంతోనూ తాము ప్రచ్ఛన్న యుద్ధం కానీ, ప్రత్యక్ష యుద్ధం కానీ చేయబోమని, తమకు ఆ ఉద్దేశం లేదని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అన్నారు. ఐక్యరాజ్య
బీజింగ్, సెప్టెంబరు 22: ఏ దేశంతోనూ తాము ప్రచ్ఛన్న యుద్ధం కానీ, ప్రత్యక్ష యుద్ధం కానీ చేయబోమని, తమకు ఆ ఉద్దేశం లేదని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి 75వ సాధారణ సమావేశంలో ఆన్లైన్ వేదికగా ఆయన మాట్లాడారు. దేశాల మధ్య అభిప్రాయ భేదాలు ఉండడం సహజమేనని, అయితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, తాము అలాగే చేస్తామని అన్నారు.
కరోనా వైరస్ గురించి ప్రస్తావిస్తూ ప్రపంచమంతా ఈ మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని, సైన్స్ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు. వైర్సను రాజకీయం చేసే ప్రయత్నాలు చేయకూడదని ఆయన కోరారు. కరోనా కారణంగా ఈ ఏడాది సమావేశాల్లో అధినేతలు ఆన్లైన్ వేదికగా మాట్లాడారు.