మిస్సింగ్‌ కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వద్దు: డీజీపీ

ABN , First Publish Date - 2020-09-29T08:10:59+05:30 IST

మిస్సింగ్‌ కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వద్దు: డీజీపీ

మిస్సింగ్‌ కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వద్దు: డీజీపీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): చిన్నారులు, మహిళల మిస్సింగ్‌ కేసుల దర్యాప్తుల్లో నిరక్ష్యంగా వ్యవహరించొద్దని డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశించారు. ఆ కేసుల్లో సుప్రీం, హైకోర్టుల సమీక్ష జరుగుతోందన్నారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ తన కార్యాలయం నుంచి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆయా కేసుల పరిష్కారానికి యాక్షన్‌ ప్లాన్‌తో దర్యాప్తు చేయాలని డీజీపీ సూచించారు. కోర్టుల్లో సీసీ నెంబర్లు పొందేందుకు అదనపు ఎస్పీలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తు వీలైనంత త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

Updated Date - 2020-09-29T08:10:59+05:30 IST