అధైర్యపడవద్దు అండగా ఉంటా : చిరుమర్తి
ABN , First Publish Date - 2021-05-17T06:11:38+05:30 IST
కరోనా బారిన పడిన కుటుంబాల వారు అఽధైర్యపడవద్దని తాను మీకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హామీ ఇచ్చారు.
నకిరేకల్, మే 16 : కరోనా బారిన పడిన కుటుంబాల వారు అఽధైర్యపడవద్దని తాను మీకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హామీ ఇచ్చారు. మునిసిపాలిటీ పరిధిలోని 1,2,5,6,17,20 వార్డుల్లో కరోనా బారిన పడి మృతిచెందిన 15కుటుంబాలకు ఒక్కొరికి రూ.10వేల చొప్పున ఆదివారం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని రూపు మాపేందుకు ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తోందన్నారు. ప్రతిఒక్కరూ మనోధైర్యంతో ఉన్నప్పుడే కరోనాను జయించవచ్చన్నారు. నకిరేకల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి నియమ ని బంధనలు పాటించాలని సూచించారు. లాక్డౌన సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రావద్దన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన శ్రీనివాస్, వైస్ చైర్మన ఉమారాణి, కౌన్సిలర్లు కందాళ భిక్షంరెడ్డి, విజయ్ పాల్గొన్నారు.