బెదిరింపులకు భయపడ వద్దు

ABN , First Publish Date - 2021-02-25T05:17:11+05:30 IST

అధికార పార్టీ నేతలు బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని, వారికి నేను అండగా ఉంటానిని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ భరోసా ఇచ్చారు.

బెదిరింపులకు భయపడ వద్దు
సమావేశంలో మాట్లాడుతున్న జయకృష్ణ

భామిని : అధికార పార్టీ నేతలు బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని, వారికి నేను అండగా ఉంటానిని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ భరోసా ఇచ్చారు. బుధవారం రాత్రి భామిని మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పంచాయతీల వారీగా ఓటమికి గల కారణాలపై ఆరా తీశారు. కార్యకర్తలు మండల కమిటీగా పనిచేయాలని సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో  మరింత కష్టపడి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జె.ఆనందరావు, గోవిందరావు, కె.కేశవరావు, జోగినాయుడు, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-02-25T05:17:11+05:30 IST