ఓటరు నమోదుకు జనన ధ్రువపత్రాల అనుసంధానం వద్దు : అసదుద్దీన్ ఒవైసీ
ABN , First Publish Date - 2021-12-04T07:43:21+05:30 IST
ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు, పాస్పోర్టుల దరఖాస్తులకు జనన, మరణాల ధ్రువీకరణ పత్రాలను అనుసంధానం చేసే ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం డిమాండ్ చేశారు.
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు, పాస్పోర్టుల దరఖాస్తులకు జనన, మరణాల ధ్రువీకరణ పత్రాలను అనుసంధానం చేసే ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ విధానం వలన ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని, పైపెచ్చు ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, కేంద్ర హోంశాఖ కు పంపిన లేఖలో పేర్కొన్నారు.