న్యాయం చేయండి
ABN , First Publish Date - 2022-05-27T06:45:30+05:30 IST
తమకు న్యాయం చేయాలని ఎన్నెస్పీ కాల్వకట్ట బాధితులు హైకోర్టులో గురువారం ఉద యం లంచ్మోషన్ పిటిషన్ (డబ్లూఏపీ23997-2022) దాఖ లు చేశారు.
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎన్నెస్పీ కాల్వ కట్ట బాధితులు
హుజూర్నగర్లో అధికారులు కూల్చిన ఇళ్లు
హుజూర్నగర్, మే 26: తమకు న్యాయం చేయాలని ఎన్నెస్పీ కాల్వకట్ట బాధితులు హైకోర్టులో గురువారం ఉద యం లంచ్మోషన్ పిటిషన్ (డబ్లూఏపీ23997-2022) దాఖ లు చేశారు. పట్టణంలోని లింగగిరి మేజర్ కాల్వకట్టపై నివాసం ఉంటున్న బాధితులతో పాటు రోడ్డు పక్కన ఉన్న పట్టా భూముల్లోని ఇళ్లను అక్రమంగా అధికారులు కూల్చారని బాధితులు పిటిషన్లో పేర్కొన్నారు. బాధితులు కారెంగుల పాండు, నలమాద జ్యోతి, ఐతగాని రాజ్యం, పాస్టర్ ఫీటర్, జయరాం, మరి కొంతమంది తరఫున హైకో ర్టు న్యాయవాది రత్నసాగర్ ఈ పిటిషన్ను దాఖలు చేశా రు. కాగా కోర్టు తీర్పు వచ్చేలోగా ఇళ్లను అధికారులు కూ ల్చివేశారని వారు వాపోయారు. కాల్వకట్టలపై పట్టా భూ ముల్లో నివాసం ఉంటున్నా, అధికారులు ఎలాంటి నోటీసు లు ఇవ్వకుండ ఇళ్లను కూల్చివేస్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా, బాధితులకు నాయ్యం జరిగేంతవరకు పోరాడుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి, పార్టీ రాష్ట్ర నేత వేలంగి రాజు అన్నారు.