పరిహారం చెల్లింపులో న్యాయం చేయండి
ABN , First Publish Date - 2022-06-30T06:02:42+05:30 IST
పరిహారం చెల్లింపులో న్యాయం చేయండి
మొయినాబాద్ రూరల్, జూన్ 29: హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణలో తము విలువైన భూములు కోల్పోతున్నామని, పల్లిహారం చెల్లింపులో న్యాయం చేయాలని మూర్తుజగూడ గ్రామ రైతులు గ్రామస్థులు బుధవారం మంత్రి సబితారెడ్డిని కోరారు. ఈ మేరకు వారు మంత్రి నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. మంత్రి స్పందించి ఈ విషయమై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో పాల్మకుల కృష్ణ, పాల్మకుల యాదయ్య యాదవ్, పెంటారెడ్డి, నర్సింహారెడ్డి, ముకుందరెడ్డి, మల్లయ, కుమ్మరి పెంటయ్య, పొగాకు నర్సింహ, సామ రంగారెడ్డి, కృష్ణారెడ్డి, శివయాదవ్ ఉన్నారు.