పంచాయతీల అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-10-19T04:17:34+05:30 IST
గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి వేగంగా జరిగేందుకు వార్డు సభ్యులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి ఎం. ధనలక్ష్మి అన్నారు.
జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి
నాయుడుపేట/టౌన్, అక్టోబరు 18 : గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి వేగంగా జరిగేందుకు వార్డు సభ్యులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి ఎం. ధనలక్ష్మి అన్నారు. నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి అధ్యక్షతన వార్డు సభ్యులకు నాలుగు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారిణి మాట్లాడుతూ వార్డు సభ్యులు విధులను బాధ్యతగా నిర్వర్తించడం వల్ల అభివృద్ధి జరుగుతుందని సూచించారు. అనంతరం ఎంపీపీ ధనలక్ష్మి మాట్లాడుతూ ఈ నాలుగు రోజుల శిక్షణ తరగతుల్లో ప్రతి సభ్యుడూ విధులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీవో వెంకటరమణ, ఎంపీడీవో శివప్రసాద్, డీఆర్పీ వెంకటరావు పాల్గొన్నారు.