రోడ్డు ప్రమాదంలో డీఎంకే రాజ్యసభ సభ్యుడి కుమారుడు మృతి
ABN , First Publish Date - 2022-03-10T14:15:43+05:30 IST
డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్ ఆర్ ఎలన్ గోవన్ కుమారుడు రాకేష్ గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు....
చెన్నై(తమిళనాడు): డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్ ఆర్ ఎలన్ గోవన్ కుమారుడు రాకేష్ గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. పుదుచ్చేరి నుంచి చెన్నైకు కారులో వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రాకేష్ మరణించారు. కారులో ఉన్న మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు.