ప్రసార మాధ్యమాల్లో అన్నాడీఎంకే తప్పుడు ప్రచారాలు

ABN , First Publish Date - 2021-01-25T11:40:14+05:30 IST

ఎన్నికల్లో గెలుపొందాలని అన్నాడీఎంకే ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోందని డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, ఎంపీ కనిమొళి ...

ప్రసార మాధ్యమాల్లో అన్నాడీఎంకే తప్పుడు ప్రచారాలు

 డీఎంకే ఎంపీ కనిమొళి

చెన్నై/వాషర్‌మెన్‌పేట (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో గెలుపొందాలని అన్నాడీఎంకే ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోందని డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. రామనాథపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, మహిళలకు భద్రత కల్పించడంలో అన్నాడీఎంకే పూర్తి గా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపొందాలని అడ్డుదారుల్లో అన్నాడీఎంకే నడుస్తుందనడానికి ప్రసార మాధ్యమాలే సాక్ష్యం అన్నారు. ప్రభుత్వం ప్రకటన కోసమే పథకాలు ప్రారంభిస్తుందని, అందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. తప్పుడు సమాచారం చేసే వారికి గుణపాఠం చెప్పే రోజులు త్వరలో రానున్నాయని కనిమొళి పేర్కొన్నారు.

Updated Date - 2021-01-25T11:40:14+05:30 IST