Dmk నాయకుడి దారుణ హత్య
ABN , First Publish Date - 2022-02-26T16:14:25+05:30 IST
కాంచీపురం సమీపంలో శుక్రవారం ఉదయం డీఎంకే నాయకుడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి జరిపి దారుణంగా హత్య చేశారు. కాంచీపురం సమీపం కోనేరికుప్పంలో శేఖర్, శైలజ అనే భార్యా
చెన్నై: కాంచీపురం సమీపంలో శుక్రవారం ఉదయం డీఎంకే నాయకుడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి జరిపి దారుణంగా హత్య చేశారు. కాంచీపురం సమీపం కోనేరికుప్పంలో శేఖర్, శైలజ అనే భార్యా భర్తలు నివసిస్తున్నారు. శేఖర్ డీఎంకే జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో శేఖర్ మోటరు బైకుపై తల యారి వీధిలో వెళుతుండగా ముగ్గురు దుండగులు ఆయనను చుట్టుముట్టి వేటకొడవళ్లతో దాడి జరిపి మెరుపువేగంతో పారిపోయారు. ఈ సంఘటనలో శేఖర్ ఒంటి నిండా గాయాలతో రోడ్డుపై పడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న కాంచీపురం తాలూకా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శేఖర్ను చికిత్స కోసం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన నగరపాలక ఎన్నికల సందర్భంగా ఓ వర్గానికి చెందినవారితో శేఖర్ గొడవపడ్డారని, ఆ నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుం దని పోలీసులు అనుమానిస్తున్నారు.