వివేకా హత్య కేసు విచారణపై డీఎల్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-21T20:54:46+05:30 IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై డీఎల్ రవీంధ్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్య కేసు విచారణపై డీఎల్ సంచలన వ్యాఖ్యలు

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై డీఎల్ రవీంధ్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో వివేకా కుమార్తె సునీతా, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై నిందలు వేస్తూ కొందరు మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ డీఎల్ అన్నారు. నిందితులను ఎవరు వెనుకేసుకొస్తున్నారో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. సీబీఐని మేనేజ్ చేసుకునే ప్రయత్నాలు చేశారని అన్నారు.


అయితే ఇప్పటి వరకు సీబీఐ అధికారులు ఎవరి ఒత్తిళ్లకు లొంగలేదని, విచారణ పకడ్బందీగా జరుగుతోందని డీఎల్ తెలిపారు. ఖచ్చితంగా వివేకా హత్య కేసు నిందితులు ఎవరో తెలుస్తుందని, కేసుతో ప్రమేయం ఉన్న ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరని రవీంధ్రారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-03-21T20:54:46+05:30 IST