రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేసింది: డీకే అరుణ
ABN , First Publish Date - 2021-12-03T01:40:26+05:30 IST
ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు ఇచ్చి కొత్త పథకాలు ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి కేసిఆర్కు పరిపాటిగా మారిందని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు.
రంగారెడ్డి: ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు ఇచ్చి కొత్త పథకాలు ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి కేసిఆర్కు పరిపాటిగా మారిందని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. లక్ష రూపాయలు రుణమాఫీ ప్రకటించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ హామీ అమలుపర్చలేదన్నారు. వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి చివరి గింజ కొంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేసిందన్నారు.