చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం రావడం లేదు: డీకే అరుణ

ABN , First Publish Date - 2022-01-11T23:35:13+05:30 IST

317 జీవో వల్ల ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. ఉపాధ్యాయులు చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం రావడం లేదు: డీకే అరుణ

హైదరాబాద్: 317 జీవో వల్ల ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. ఉపాధ్యాయులు చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 317 జీవో సవరించే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ఫలాలను కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోందన్నారు. ఏడేళ్లైనా పాలమూరు ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడం లేదన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ దోచుకుంటూ ఏ హామీ నెరవేర్చడం లేదని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-01-11T23:35:13+05:30 IST