ధాన్యం కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉంది: డీకే అరుణ
ABN , First Publish Date - 2021-12-22T23:15:21+05:30 IST
ధాన్యం కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ నేత డీకే అరుణ తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పూటకో మాటతో రైతులను
ఢిల్లీ: ధాన్యం కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ నేత డీకే అరుణ తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పూటకో మాటతో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్కు చిత్తశుద్ధిలేదని తప్పుబట్టారు. హుజురాబాద్లో బీజేపీ గెలుపుతో కేసీఆర్కి మతి చెలించిందన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయామనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవాచేశారు. కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేయడం కేసీఆర్ మానుకోవాలని హెచ్చరించారు. సీఎం ఏది చెప్తే మంత్రులు కూడా అదే మాట్లాడుతున్నారని, గ్రౌండ్ రియాలిటీ మంత్రులకు తెలియదా? అని డీకే అరుణ ప్రశ్నించారు.