నిన్న చంద్రబాబును కలిసి దివ్యవాణి ఆనందం.. తెల్లారేసరికి రాజీనామా..

ABN , First Publish Date - 2022-06-02T13:54:25+05:30 IST

తెలుగుదేశం పార్టీకి సినీనటి దివ్యవాణి రాజీనామా చేశారు. గత రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె కలిశారు.

నిన్న చంద్రబాబును కలిసి దివ్యవాణి ఆనందం.. తెల్లారేసరికి రాజీనామా..

అమరావతి : తెలుగుదేశం పార్టీకి సినీనటి దివ్యవాణి రాజీనామా చేశారు. గత రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె కలిశారు. పార్టీ కార్యాలయంలో తనకు ఎంతో మర్యాద ఇచ్చారని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం జరిగే ప్రెస్‌మీట్‌లో అన్ని వివరాలు వెల్లడిస్తానని దివ్యవాణి పేర్కొన్నారు. నిన్న చంద్రబాబుకు అన్ని వివరాలు చెప్పానని మీడియాకు దివ్యవాణి వివరించారు. మళ్లీ ఏమైందో ఏమో కానీ ఉదయానికి రాజీనామా చేస్తున్నట్టు దివ్యవాణి వీడియో పంపారు. ప్రస్తుతం తన రాజీనామాపై హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడిస్తున్నారు.


అనంతరం నిన్న వెళ్లి చంద్రబాబును కలిసి చాలా ఆనందంగా మీడియాతో మాట్లాడారు. తనకు చంద్రబాబు చాలా మర్యాద ఇచ్చారంటూ సంతోషపడ్డారు. విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. రాజకీయం తెలియదని విమర్శించిన వారికీ కృతజ్ఞతలని దివ్యవాణి వ్యంగ్యాస్త్రం సంధించారు. దీంతో.. దివ్యవాణి టీడీపీలోనే కొనసాగుతారని.. ఈ గందరగోళానికి తెరపడినట్టేనని అంతా భావించారు. ఈ విషయంపై వివరణ ఇచ్చి, తన ఇబ్బందులను వివరించేందుకు దివ్యవాణి చంద్రబాబును కలిశారు.  మళ్లీ ఏమైందో ఏమో కానీ తెల్లవారి పాటికి రాజీనామా చేస్తున్నట్టు వీడియో పంపారు.


కాగా... మొన్న(మంగళవారం) కూడా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టి దివ్యవాణి కాసేపు హడావుడి చేశారు. అనంతరం దానిని తొలగించారు. ‘తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల  ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో ఆమె రాసుకొచ్చారు. తనను సస్పెండ్‌ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరపడి ట్వీట్‌ పెట్టానని దివ్యవాణి తెలిపారు.

Updated Date - 2022-06-02T13:54:25+05:30 IST