ఎక్మాయిలో పాతకక్షలతో దివ్యాంగుడి హత్య

ABN , First Publish Date - 2022-01-25T05:11:04+05:30 IST

ఎక్మాయిలో పాతకక్షలతో దివ్యాంగుడి హత్య

ఎక్మాయిలో పాతకక్షలతో దివ్యాంగుడి హత్య
హత్యకు గురైన బోయిని నాగప్ప

బషీరాబాద్‌, జనవరి 24: ఇంటి స్థలం విషయంలో తగాదాలు మ నసులో పెట్టుకొని దాయాదులు ఓ దివ్యాంగుడిని కొట్టి చంపారు. ఈ సంఘటన ఎక్మాయి లో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బోయిని నాగప్ప(46) దివ్యాంగుడు. అతడిరి, దాయాదికి నాగప్పకు మధ్య ఇంటి వద్ద స్థలం విషయంలో గొడవలు జరిగాయి. ఆదివారం రాత్రి నాగప్ప, దాయాది నాగప్పకు మధ్య మరోసారి గొడవ జరిగింది. దివ్యాంగుడిపై నాగప్ప, అతడి కుమారుడు ప్రశాంత్‌ కొట్టి, గుద్ది చంపినట్లు నాగప్ప భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగప్ప మృతదేహాన్ని ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయారన్నారు. సోమవారం ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి గ్రామానికి చేరుకొని పరిశీలించారు. నాగప్పను హత్య చేసిన కేసులో తండ్రి, కొడుకును అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి సందర్శించారు. నాగప్ప భార్య అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-01-25T05:11:04+05:30 IST