దివీస్ ల్యాబ్స్ లాభం రూ.702 కోట్లు
ABN , First Publish Date - 2022-08-13T05:38:33+05:30 IST
దివీస్ లేబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమా సికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.702 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దివీస్ లేబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమా సికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.702 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.557 కోట్లతో పోలిస్తే 26 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. సమీక్ష త్రైమాసికానికి మొత్తం ఆదాయం రూ.1,997 కోట్ల నుంచి రూ.2,343 కోట్లకు చేరింది. ఫారెక్స్ లావాదేవీల ద్వారా లభించిన ఆదాయం రూ.20 కోట్ల నుంచి రూ.56 కోట్లకు చేరినట్లు పేర్కొంది.