గ్రామాల అభివృద్ధికి దివీస్ చేయూత
ABN , First Publish Date - 2021-04-21T07:13:17+05:30 IST
గ్రామాల అభివృద్ధికి దివీస్ చేయూత అభినంద నీయమని వైస్ఎంపీపీ ఉప్పు భద్రయ్య, సర్పంచ్ ముద్దం సుమిత్రసత్తయ్యగౌడ్లు అన్నారు.
రూ.5.55 లక్షల చెక్కు అందజేత
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 20: గ్రామాల అభివృద్ధికి దివీస్ చేయూత అభినంద నీయమని వైస్ఎంపీపీ ఉప్పు భద్రయ్య, సర్పంచ్ ముద్దం సుమిత్రసత్తయ్యగౌడ్లు అన్నారు. మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామాభివృద్ధికి దివీస్ పరిశ్రమ ప్రతిని ధులు రూ.5.55లక్షల చెక్కును మంగళవారం అందజేశారు. ఈ నిధులతో జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. కార్య క్రమంలో రాజు, గోపీ తదితరులు పాల్గొన్నారు.