దివ్యశక్తి గ్రానైట్స్ డివిడెండ్ 15%
ABN , First Publish Date - 2021-06-02T10:13:57+05:30 IST
గత ఆర్థిక సంవత్సరానికి దివ్యశక్తి గ్రానైట్స్ వాటాదారులకు 15 శాతం తుది డివిడెండ్ను ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.1.5 డివిడెండ్ను చెల్లించనుంది
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గత ఆర్థిక సంవత్సరానికి దివ్యశక్తి గ్రానైట్స్ వాటాదారులకు 15 శాతం తుది డివిడెండ్ను ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.1.5 డివిడెండ్ను చెల్లించనుంది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.17 కోట్ల ఆదాయంపై రూ.2.37 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. మొత్తం ఏడాదికి ఆదాయం రూ.57 కోట్లు, లాభం రూ.8.45 కోట్లు ఉందని వెల్లడించింది.