ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-17T06:34:26+05:30 IST

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వర మే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 43 ఫిర్యాదులు వచ్చాయని తెలిపాఉ

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పథి

కలెక్టర్‌


భువనగిరి రూరల్‌, మే 16: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వర మే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 43 ఫిర్యాదులు వచ్చాయని తెలిపాఉ. వాటిలో రెవెన్యూశాఖకు సంబంఽధించినవి 33, మహిళా సంక్షేమం, భువనగిరి మునిసిపాలిటీకి చెందిన రెండేసి ఫిర్యాదులు, మోత్కూరు మునిసిపాలిటీ, లీగల్‌ మెట్రాలజీ, పోలీసు, అటవీ, బీసీ సంక్షే మ, టీపీవో శాఖలకు చెందిన ఒక్కో ఫిర్యాదు ఉందన్నారు. వీటిని సంబంధితశాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.విజయకుమారి, కలెక్టరేట్‌ ఏవో ఎం.నాగేశ్వరచారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:34:26+05:30 IST