రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నీకి జిల్లా జట్లు
ABN , First Publish Date - 2022-06-25T06:39:46+05:30 IST
రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర, బాలికల బాస్కెట్బాల్ టోర్నీలో పాల్గొనే విశాఖ జిల్లా జట్లను శుక్రవారం ప్రకటించారు.
విశాఖపట్నం(స్పోర్ట్సు), జూన్ 24: రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర, బాలికల బాస్కెట్బాల్ టోర్నీలో పాల్గొనే విశాఖ జిల్లా జట్లను శుక్రవారం ప్రకటించారు. శనివరం నుంచి కేఆర్ఎం గీతమ్లో జరిగే టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న క్రీడాకారులను జిల్లా బాస్కెట్బాల్ సంఘం ప్రతినిధులు టీఎస్ఆర్ ప్రసాద్, సునీల్ మహంతి, భూషణరావు తదితరులు అభినందించారు.
బాలుర జట్టు: పి.లీలా కుమార్, ఎస్.స్నేహిత్, పి.లోకేష్రెడ్డి, టి.జయంత్ సాయి, సైఫ్ ఉల్లా, ఐ.రేవంత్ సాయి, ఎం.వెంకటేష్, జి.అమిత్ ఆర్య, పి.మోహన్, సీహెచ్.జగదీశ్, పి.హేమంత్, కే.కార్తీక్ గణపతి నాయుడు, కోచ్: పి.సునీల్రెడ్డి
బాలికల జట్టు: ఎన్.కల్యాణి, కె.సుమిత్ర, కె.పావని, ఎస్.శృతి, జి.హేమ, వై.హేమలత, ఎం.గౌతమి, సీహెచ్.సోనియా, డి.లలిత, కె.జ్ఞాపిక, మణికంఠ, కీర్తి కోచ్: పి.జగదీశ్.