రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ టోర్నీకి జిల్లా జట్లు

ABN , First Publish Date - 2021-12-06T04:42:54+05:30 IST

ఏడవ రాష్ట్ర స్థాయి బాలుర, బాలికల బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో పాల్గొనే విశాఖ జిల్లా జట్లను ఆదివారం ప్రకటించారు.

రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ టోర్నీకి జిల్లా జట్లు
జట్ల సభ్యులతో జిల్లా సంఘం ప్రతినిధులు

విశాఖపట్నం (స్పోర్ట్సు), డిసెంబరు 5: ఏడవ రాష్ట్ర స్థాయి బాలుర, బాలికల బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో పాల్గొనే విశాఖ జిల్లా జట్లను ఆదివారం ప్రకటించారు. ఈనెల ఎనిమిది నుంచి అనంతపూర్‌లో జరగనున్న ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న క్రీడాకారులను ఆదివారం సాయంత్రం జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు సునీల్‌ మహంతీ, కార్యదర్శి జి.భూషణరావు, ఉపాధ్యక్షుడు హనుమంతరావు, కోశాధిరాకి పరశురాములు తదితరులు అభినందించారు. 

బాలుర జట్టు: పి.కుమార్‌, ఎల్‌.జోగారావు, పి.లోకేష్‌రెడ్డి, జే.జయంత్‌ సాయి, వి.విశ్వాష్‌, జీకే ఆశిష్‌, ఎం.వెంకటేష్‌, ఆనందకుమార్‌, సైఫ్‌, పి.మోహన్‌ సాయి, పి.హేమంత్‌కుమార్‌, ఎల్‌.హేమంత్‌కుమార్‌ కాగా కోచ్‌గా సునీల్‌ రెడ్డి వ్యవహరిస్తారు.

బాలికల జట్టు: కె.సంధ్య, కె.సుమిత్ర, జి.హేమ, టి.గౌరి, వై.హేమలత, దీపిక, కె.పావని, కె.స్రవంతి, జి.భవాని, ఎన్‌.కళ్యాణి, బీసీ ఐశ్వర్య, పీఏ లలిత్య, కాగా కోచ్‌గా పి.జగదీష్‌ వ్యవహరించనున్నారు. 

Updated Date - 2021-12-06T04:42:54+05:30 IST