రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2020-06-07T10:26:57+05:30 IST

కొత్తగూడెం నేషనల్‌ గ్రీన్‌ కార్డ్స్‌ ఆధ్వర్యంలో ఎర్త్‌ డే సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వివిధ పోటీల్లో జిల్లా విద్యార్థు లకు మూడు

రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

 కొత్తగూడెం సాంస్కృతికం, జూన్‌ 6: కొత్తగూడెం నేషనల్‌ గ్రీన్‌ కార్డ్స్‌ ఆధ్వర్యంలో ఎర్త్‌ డే సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వివిధ పోటీల్లో జిల్లా విద్యార్థు లకు మూడు బహుమతులు లభించాయని జిల్లా విద్యాశాఖాధికారి పి. సరోజిని దేవి, డీఎస్‌వో చలపతిరాజులు శనివారం తెలిపారు. రాష్ట్ర స్థాయి ఆన్‌లైన్‌ పోటీల్లో మూడు విభాగాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులు మూడు బహుమ తులు, రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.


పెయింట్‌ పోటీల్లో కొ త్తగూడేనికి చెందిన మాస్టర్‌ ఈకే. విద్యాలయానికి చెందిన ఎం. పావని (7వ తరగతి)కి ప్రథమ స్థానం లభించిందని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ పో టీల్లో పాల్గొనడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీ య, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను డీఈవో సరోజిని దేవి అభినం దించారు.

Updated Date - 2020-06-07T10:26:57+05:30 IST