రాష్ట్ర స్థాయి పోలీసు క్రికెట్లో జిల్లా జట్టు ప్రతిభ
ABN , First Publish Date - 2022-01-23T05:08:03+05:30 IST
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో జిల్లా పోలీసులు తమ ప్రత్యేకతను మరోసారి చాటారు. గుంటూరులో పోలీసు శాఖ ఆధ్యర్యంలో శనివారం రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి.
54 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన ఎస్పీ
నెల్లూరు(క్రైం),జనవరి 22: రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో జిల్లా పోలీసులు తమ ప్రత్యేకతను మరోసారి చాటారు. గుంటూరులో పోలీసు శాఖ ఆధ్యర్యంలో శనివారం రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు నెల్లూరు జిల్లా-గుంటూరు అర్బన్ మధ్య జరిగిన మ్యాచ్లో నెల్లూరు ఎస్పీ సీహెచ్ విజయరావు తన ప్రతిభను కనపరిచారు. 54 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్లో నెల్లూరు జిల్లా జట్టు గెలుపొందింది. ఎస్పీ ఆఫ్సైడ్, మిడాఫ్, లెగ్సైగ్, పాయింట్లో కొట్టిన షాట్లు అందర్నీ ఆకట్టుకున్నాయి.