ఎమ్మెల్యేలను కలిసిన గ్రంథాలయ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2021-07-27T03:20:54+05:30 IST

జిల్లా గ్రంథాలయ చైర్‌పర్సన్‌గా ఎంపికైన దొంతు శారద సోమవారం పలువురు ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్యేలను కలిసిన గ్రంథాలయ చైర్‌పర్సన్‌
కాకాణిని కలిసిన జిల్లా గ్రంథాలయ చైర్‌పర్సన్‌ దొంతు శారద

వెంకటగిరి, జూలై 26: జిల్లా గ్రంథాలయ చైర్‌పర్సన్‌గా ఎంపికైన దొంతు శారద సోమవారం పలువురు ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత సర్వేపల్లి ఎమ్మెల్యే , జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాణి గోవర్దన రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. జిల్లా గ్రంథాలయ అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డిని కలిశారు. ఇది వరకు ఈమె వెంకటగిరి ఎమ్మెల్యే అనం రామనారాయణ రెడ్డి, సీఎం సలహాదారుడు సజ్జల రామకృష్ణానెడ్డిని కలిశారు. ఆమె వెంట నాయకులు దొంతు బాలకృష్ణ ఉన్నారు. 


Updated Date - 2021-07-27T03:20:54+05:30 IST