ముగిసిన సబ్‌ జూనియర్‌ ్స జిల్లా స్థాయి ఎంపికలు

ABN , First Publish Date - 2021-12-06T05:12:14+05:30 IST

31వ సబ్‌ జూనియర్స్‌ జిల్లా స్థాయి కబడ్డీ బాల బాలికల ఎం పికలు ఆదివారం ముగిశాయి.

ముగిసిన సబ్‌ జూనియర్‌ ్స జిల్లా స్థాయి ఎంపికలు
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ప్రదీప్‌ డానియల్‌

కడప మారుతీనగర్‌,  డిసెంబరు 5 : 31వ సబ్‌ జూనియర్స్‌ జిల్లా స్థాయి కబడ్డీ బాల బాలికల ఎం పికలు ఆదివారం ముగిశాయి. కడప డీఎస్సీ స్టేడియంలో జరిగిన ఎంపికలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాప్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ డానియల్‌, ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొండు సమరనాథరెడ్డి హాజరయ్యారు.  జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, జనార్థన్‌ ఆద్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియలో 20 మంది బాలురు,  20 మంది బాలికలను ఎంపిక చేసినట్లు కోచ్‌ జనార్థన్‌ వెల్లడించారు. ఎంపికైన వారికి ఈ నెల 10వ తేదీ నుంచి కోచింగ్‌ నిర్వహించి, అందులో మెరుగైన 12 మంది క్రీడాకారులను ఫైనల్‌గా ఎంపిక చేస్తారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఈనెల 17, 18, 19, తేదీలలో జరుగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సభ్యులు ప్రసాద్‌, సురేంద్ర, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T05:12:14+05:30 IST