కేటీఆర్‌తో సమావేశమైన జిల్లా నాయకులు

ABN , First Publish Date - 2021-10-24T05:02:32+05:30 IST

కేటీఆర్‌తో సమావేశమైన జిల్లా నాయకులు

కేటీఆర్‌తో సమావేశమైన జిల్లా నాయకులు
తెలంగాణ భవన్‌ వద్ద ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, పార్టీ ప్రజాప్రతినిధులు

షాద్‌నగర్‌ అర్బన్‌/ఆమనగల్లు: టీఆర్‌ఎస్‌ నిర్వహించబోతున్న ఫ్లీనరీ కోసం శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సన్నామక సమావేశానికి ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీ, జడ్పీటీసీలు తరలివెళ్లారు. 25న ప్లీనరీని విజయవంతం చేయాలని సన్నాహక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈటె గణేష్‌, షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, కొత్తూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ లావణ్యదేవేందర్‌యాదవ్‌, ఎంపీపీలు వై.రవీందర్‌యాదవ్‌, ఖాజా ఇద్రిస్‌, మధుసూదన్‌రెడ్డి, జంగయ్య, జడ్పీటీసీలు విశాలశ్రవణ్‌కుమార్‌రెడ్డి, శ్రీలతసత్యనారాయణయాదవ్‌, బంగారు స్వరూప, రాగమ్మ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు రాంబల్‌నాయక్‌ పాల్గొన్నారు. ప్లీనరీ స న్నాహక సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మె ల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గోలి శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. ఆమనగల్లు, కడ్తాల్‌, మాడ్గుల, తలకొండపల్లి మండలాల నుంచి ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. ప్లీనరి, వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభ విజయవంతంపై మంత్రి కేటీఆర్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టు నాయకులు తెలిపారు. సమావేశంలో నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, అనంతరెడ్డి, అర్జున్‌రావు, గిరియాదవ్‌, గంప వెంకటేశ్‌, అనురాధ, దశర్‌థనాయక్‌, కుమార్‌, లక్ష్మీనర్సింహారెడ్డి, బి.శ్రీనివా్‌సరెడ్డి, లచ్చిరామ్‌, పరమేశ్‌, సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌, శ్రీశైలం పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:02:32+05:30 IST